Friday, April 19, 2024

గుంటూరు సంఘటన దురదృష్టకరం : సోము వీర్రాజు

గుంటూరులో నిన్న జరిగిన ఘటనలపై బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. గుంటూరు ఘటన నిర్వాహకుల వైఫల్యం బయటపడిందని మండిపడ్డారు. కందుకూరు ఘటన మరువక ముందే ఇది జరగడం బాధాకరమన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఇలాంటి దుర్ఘటన రాబోయే రోజుల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రతిపక్షాల ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అధికారమే పరమావధిగా ఇటువంటి చర్యలు పేద ప్రజల జీవితాలతో చెలగాటంగా బీజేపీ భావిస్తుందని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement