Friday, April 26, 2024

టీడీపీ మండ‌లాధ్య‌క్షుడిపై కాల్పులు..

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నబాలకోటేశ్వరరెడ్డిపై పిస్టల్‌ తో కాల్పులు జరిగాయి. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాలకోటేశ్వర రెడ్డిని వెలుపలికి పిలిచి దారుణానికి పాల్పడ్డారు. కాల్పులకు పాల్పడింది పమ్మి వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. పిస్టల్‌లోంచి దూసుకెళ్లిన బుల్లెట్ బాలకోటిరెడ్డి ఎడమవైపు నుంచి పొట్టలోకి దూసుకెళ్లింది. మరో బుల్లెట్ గురితప్పి పక్కకు దూసుకుపోయింది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పరారయ్యారు. కాల్పులు జరిపిన వారిలో పమ్మి వెంకటేశ్వరరెడ్డితోపాటు పూజల రాముడు, గడ్డం వెంకట్రావు ఉన్నారని బాధితుడు తెలిపారు. తుపాకి తూటాకు గురైన బాలకోటిరెడ్డిని అత్యవసరంగా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement