Sunday, May 5, 2024

గుండెపోటుతో సీఐడీ డీఎస్పీ దిలీప్ కుమార్ మృతి

మంగళగిరి : సీఐడీ డీఎస్పీ టి.దిలీప్ కుమార్ (52) గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గతంలో దిలీప్ కుమార్ మంగళగిరి రూరల్, తాడేపల్లి ఎస్ఐగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలను పొందారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ప్రస్తుతం గుంటూరులో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తోన్నారు.

ఈ నేపధ్యంలో మంగళవారం గుండెపోటుకు గురైన సీఐడీ డీఎస్పీ దిలీప్ కుమార్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందారు. సీఐడీ డీఎస్పీ దిలీప్ కుమార్ ఆకస్మిక మృతి వార్తను తెలుసుకున్న పలువురు పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది దిగ్ర్భాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా హఠాన్మరణం చెందిన సీఐడీ దిలీప్ కుమార్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం గుంటూరులో పోలీస్ శాఖ లాంఛనాలతో నిర్వహించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement