Thursday, April 25, 2024

AP : బిజెపి గూటికి గూడూరు వైసిపి ఎమ్మెల్యే

ఎపి లోని వైసీపీ భారీ షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే పార్టీకి బైబై చెప్పేసారు. ఈ రోజు న్యూ ఢిల్లీ లో ఆయన కేంద్ర అనురాగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బీజీపీలో చేరారు.ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తనకు పార్టీ లో స్తానం కల్పించినందుకు బీజేపీకి అలానే తనకు అవకాశం ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.ఇక తిరుపతి ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక చిరంజీవి అవకాశం కల్పించడంతో తన రాజకీయ ప్రస్థానం మొదలయింది అని, అలానే పవన్ కళ్యాణ్ కూడా తనకి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తనకి అవకాశం ఇచ్చారని.. తనకి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నిజాయితీగా కృతజ్ఞతలు తెలుపుతున్న అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement