Wednesday, May 1, 2024

AP | రెండున్నర కోట్ల విలువైన బంగారం పట్టివేత.. ఐదుగురు అరెస్టు..

సత్యనారాయణపురం (ప్రభ న్యూస్): అనధికారికంగా చెన్నై నుండి విజయవాడకు నగలను తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు మూడు కేజీల 681 గ్రాముల బంగారం సాధించి స్వాధీనం చేసుకున్నట్లు సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ సిఐ ఎం వెంకటరమణ తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి…

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాధారణ ఎన్నికలతో భాగంగా గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రైల్వే స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తుండగా విజయవాడ నగరానికి చెందిన నాగ పవన్ తో పాటు మరో నలుగురు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో వారి వద్ద ఉన్న బ్యాంకులు తనిఖీ చేయగా అనధికారికంగా తరలిస్తున్న బంగారం లభ్యమైనట్లు తెలిపారు సుమారు రెండు కోట్ల 20 లక్షల రూపాయల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ నగలకు సంబంధించి ఎటువంటి వివరాలు బిల్లులు వారి వద్ద లభించలేదన్నారు. వీరిని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు ఈ తనిఖీల్లో ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement