Wednesday, May 1, 2024

ISRO: నాలుగు నెల‌ల్లో నింగిలోకి మ‌రో నాలుగు ఉప‌గ్ర‌హాలు .. ఇస్రో చైర్మన్

జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేప‌థ్యంలో రాకెట్ విజయవంతం కావాలని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చామ‌ని,.. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని తెలిపారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు, తుఫాన్ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందని వెల్లడించారు.

ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సమాచార ఉపగ్రహాలలో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నామ‌ని అన్నారు. నేడు పంపుతున్న ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందన్న ఆయన.. ఇలాంటి కమ్యూనికేషన్ శాటిలైట్లు రాబోయే కాలంలో మరిన్ని ప్రయోగిస్తామ‌ని అన్నారు. .. రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక, GSLV F15 ద్వారా NISSAR ఉపగ్రహ ప్రయోగం జూన్ లో ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement