Saturday, April 27, 2024

AP : మాజీ మంత్రి ప‌త్తిపాటి కుమారుడు శ‌ర‌త్ అరెస్ట్ …

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు నేడు శరత్‌ను అరెస్ట్ చేశారు. కాగా, శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే టీడీపీ తరపున చిలకలూరి పేట అభ్యర్థిగా శరత్ తండ్రి పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టేందుకే ఈ అరెస్ట్ లంటూ టిడిపి శ్రేణులు ఆరో్ప‌ణ‌లుంటున్నాయి. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement