Monday, May 6, 2024

పాపికొండ‌ల విహారానికి.. మ‌రోసారి బ్రేక్

పాపికొండ‌ల విహారానికి మ‌రోసారి బ్రేక్ ప‌డింది. ఏపీలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా పాపికొండ‌ల‌కి పేరుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఆదేశాలు జారీ చేసినట్టు పోచవరం పర్యాటక కంట్రోల్ రూం పర్యవేక్షకుడు రాజేశ్ తెలిపారు. పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల కూడా పలుమార్లు పోలవరం బోట్లను నిలిపివేశారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement