Sunday, April 28, 2024

Floating Bridge – నిన్న ప్రారంభించారు – నేడు కొట్టుకు పోయింది

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రూ.1.60 కోట్లతో ఏపీ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది.

ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయింది.చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన వల్ల ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అందరూ భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement