Monday, May 6, 2024

AP | గంజాయి అమ్ముతున్న అయిదుగురు అరెస్టు

తిరుపతి సిటీ, (ప్రభన్యూస్): తిరుప‌తి జిల్లాలో సెబి (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు గంజాయి అమ్ముతున్న వారిపై దాడులు చేశారు. ఈ క్ర‌మంలో ఇవ్వాల (శ‌నివారం) అయిదుగురిని అరెస్టు చేసి, వారి నుంచి అయిదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ స్టేషన్ పరిధిలోని తిరుచానూరు పంచాయతీ గ్రాండ్ బ్రిడ్జి హోటల్ వెనుక నిర్మాణుశ్య‌ ప్రాంతంలో కొంతమంది గంజాయి అమ్ముతున్న‌ట్టు సెబ్ అధికారుల‌కు స‌మాచారం అందింది. అక్క‌డికి వెళ్లి ప‌రిశీలించ‌గా.. ఐదుగురు వ్య‌క్తులు తలా ఒక కేజీ చొప్పున అమ్ముతున్న‌ట్టు త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డింది. దీంతో అయిదుగురిని అరెస్టు చేశారు. వారిలో పి. సాయికృష్ణారెడ్డి, టోని, జి. హేమంత్ అలియాస్ బిట్టు, డి.ముని రాజమ్మ, కె. పవన్ కుమార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement