Sunday, April 28, 2024

Cyclone: వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంను ఆనుకుని మలక్కా జలసంధి వద్ద నిన్న ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ ఉదయానికి పశ్చిమంగా పయనించి దక్షిణ అండమాన్ సముద్రంపై కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని, ఆపై నవంబరు 30 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.

అక్కడ్నించి వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 2 నాటికి తుపానుగా మారుతుందని వివరించింది. ఈ కారణాల వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement