Thursday, April 25, 2024

AP: ఏపీలో ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్నిప్ర‌మాదం… త‌ప్పిన ప్రాణాపాయం..

ఏపీలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఇవాళ ఉదయం విజ‌య‌వాడ‌లోని న్యూ ఆటోన‌గ‌ర్‌లోని ఆయిల్‌శుద్ధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు.

- Advertisement -

దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాద సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయని, కానీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముందు జాగ్రత్త వహిస్తే పెను ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement