Sunday, April 28, 2024

AP : లారీలో మంట‌లు.. 20ల‌క్ష‌ల ఆస్తీన‌ష్టం…

క‌ర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి అట్ట పెట్టెలతో ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. బళ్లారి నుంచి హైదరాబాద్ కు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న లారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు రావడాన్ని గ్రహించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement