Sunday, April 28, 2024

ఆదోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం రూ. 3 కోట్ల విలువైన కాటన్ బూడిద

.కర్నూలు జిల్లా, ఆదోని పట్టణ శివారులోని మాధవరం రోడ్డు పక్కన ఉన్న కె ఎన్ టి సి జిన్నింగ్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో సంభవించిన ప్రమాదము వల్ల సుమారు రూ.3 కోట్లు విలువచేసే పత్తి దూది బెల్లు,పత్తి గింజలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఆదోనిలోని రెండు ఫైర్ ఇంజన్లు అలాగే ఎమ్మిగనూరు, ఆలూరు కు చెందిన మరో రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. కొద్ది వరకు మంటలు అదుపులో వచ్చాయి ఫ్యాక్టరీ నిండా పొగ వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement