Wednesday, May 15, 2024

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్ వచ్చిన తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం హరియాణా రాజ్‌భవన్‌లో దత్తాత్రేయ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ ఇద్దరు ఆర్ధిక మంత్రులను సన్మానించి కురుక్షేత్ర ప్రతిమలను బహూకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement