Friday, April 26, 2024

సాయి కోసం అభిమానుల పూజలు..

బైక్ యాక్సిడెంట్ లో తీవ్రగాయపడిన హీరో సాయితేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయితేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో సాయితేజ్ అభిమానులు మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. మెగాహీరో ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని ప్రార్థించారు. సాయిధరమ్ తేజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలోనూ, రాజమండ్రిలోని సూర్యభగవానుడి ఆలయంలోనూ అభిమానులు పూజలు చేశారు. తమ హీరో క్షేమంగా ఉండాలంటూ ప్రార్థించారు.

కాగా, సాయిధరమ్‌ తేజ్‌.. మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు. కాలర్‌ బోన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సాయి తేజ్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement