Saturday, May 4, 2024

రీసెట్‌ అభ్యర్థుల రిపోర్ట్‌ గడువు పెంపు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఏపీఆర్‌ సెట్‌- 2021లో సీట్లు పొందిన అభ్యర్థులు విశ్వవిద్యాలయాల్లో రిపోర్ట్‌ చేసే గడువు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొ. వి. శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో ఉన్నత విద్యామండలి పక్షాన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రీసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందేనన్నారు. రీసెట్‌ ఫలితాలు విడుదలైన తర్వాత వెబ్‌ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులను మెరిట్‌, రోస్టర్‌ ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్‌ సీట్లకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఏప్రిల్‌ 23 నుంచి 30వ తేదీలోగా ఆయా విశ్వవిద్యాలయాల్లో రిపోర్ట్‌ చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. అయితే కొందరు అభ్యర్థులు గడువు పెంచాలని చేసిన విజ్ఞప్తుల మేరకు వర్సిటీల్లో రిపోర్ట్‌ చేసేందుకు గడువును మే నాలుగో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement