Friday, May 17, 2024

మంత్రులు క్ష‌మాప‌ణ చెప్పేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టం: నారా లోకేశ్‌

అమరావతి: అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేల‌ హాజరు అంశంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వివరణ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా అనేది టీడీఎల్పీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పొలిట్‌ బ్యూరోలో మెజారిటీ సభ్యులు సభలకు వెళ్లొద్దనే అభిప్రాయం వ్య‌క్తం చేశార‌న్నారు. మంత్రులు క్షమాపణ చెప్పేవరకు సభలకు వెళ్లొద్దని సభ్యుల అభిప్రాయమని తెలిపారు. ‘‘శాసనసభ సాక్షిగా నా తల్లికి అవమానం జరిగింది. ఇది ఏ ఒక్క మహిళకో జరిగిన అవమానం కాదు. రాష్ట్ర మహిళలందరికీ జరిగిన అవమానం..’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement