Friday, April 26, 2024

ఖతర్ లో మనీలాండరింగ్… విశాఖ వాసి ఆస్తులు జప్తు

ఖతర్ దేశంలో మనీలాండరింగ్ కు పాల్పడిన విశాఖకు చెందిన సుబ్రహ్మణ్య శ్రీనివాస్ పిన్నిటి అనే వ్యక్తి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. డోహ్రాలోని అల్ మీరా కన్జూమర్ గూడ్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న శ్రీనివాస్… వినియోగదారుల నుంచి లంచాలు తీసుకున్నట్లు ఖతర్ లో కేసు నమోదు అయ్యింది. లంచం సొమ్మును భారత్ లోని బ్యాంకులకు మళ్లించినట్లు ఖతర్ దర్యాప్తు సంస్థ గుర్తించింది. దర్యాప్తు, సొమ్ము జప్తుకు సహకరించాలని భారత్ ను ఖతర్ అధికారులు కోరారు. ఇటీవల విశాఖలోని సుబ్రహ్మణ్య శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. విశాఖ, విజయనగరంలో 3 ప్లాట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు గుర్తించారు. ఖతర్ దేశం వినతి మేరకు రూ.88 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement