Saturday, April 20, 2024

వందే భారత్ లో సెల్ఫీ… డోర్ లాక్ తో అవస్థలు….

సికింద్రాబాద్ – విశాఖ మధ్య తిరిగే వందే భారత్ ట్రైన్ లోపల సెల్పీ తీసుకోవాలనే ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. వివరాలలోకి వెళితే విశాఖ నుంచి వస్తున్న ట్రైన్ రాజమండ్రిలో ఆగింది. ఆగగానే ఫొటో తీసుకునేందుకు సరదాగా ట్రైన్‌ ఎక్కేశాడు ఓ వ్యక్తి .. లోపల సెల్ఫీ తీసుకుని రైలు దిగుదామని అనుకునే సమయంలోనే ట్రైన్ డోర్ లు అటోమేటిక్ గా మూసుకుపోయాయి. దీంతో కంగారుపడ్డ వ్యక్తి టీసీని డోర్‌ తీయాలంటూ వేడుకున్నాడు. కాళ్లా వేళ్లా పడ్డారు ససేమిరా అన్న టీసీ విజయవాడ వరకూ ఆగాల్సిందే అన్నాడు. టిక్కెట్ లేకుండా రైలు ఎక్కినందుకు ఫైన్ తో పాటు విజయవాడ వరకు టికెట్ ఇచ్చాడు..విజయవాడ లో రైలు ఆగిన వెంటనే దిగి మరో రైలులో రాజమండ్రికి పయనమయ్యాడు.. ఈ సంఘటనను రైలులో ప్రయాణిస్తున్న ఒకరు వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.

https://www.facebook.com/watch/?v=723689205984590

Advertisement

తాజా వార్తలు

Advertisement