Tuesday, May 14, 2024

Dhavaleswaram: బస్సు ఢీకొని బాలుడి మృతి… బస్సును ధ్వంసం చేసిన బంధువులు

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతిచెందడంతో… బాలుడి బంధువులు ఆగ్రహంతో బస్సును ధ్వంసం చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద చోటుచేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న బాలుడు మృతిచెందగా, అతడి తండ్రికి గాయాలయ్యాయి. వివరాలు.. బాలుడిని స్కూల్‌లో దింపేందుకు అతడి తండ్రి బైక్‌పై తీసుకెళ్తున్నాడు. అయితే వారి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే బైక్‌పై నుంచి పక్కకు పడిపోయిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement