Friday, May 17, 2024

AP | ఈనెల‌ 22లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి.. రైతులకు వ్యవసాయశాఖ వినతి

అమరావతి, ఆంధ్రప్రభ: పీఎం కిసాన్‌ – డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 16వ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈనెల 22 లోపు రైతులంతా ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ వెల్లడించింది. పీఎం కిసాన్‌ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రూ 2 వేల చొప్పున రూ 6వేల సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 7,500 కలిపి మొత్తం రూ 13,500 అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్ళుగా 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందించనున్నారు.

నిర్దేశిత నిబంధనల మేరకు ఈక్రాప్‌ తో పాటు- ఈ కేవైసీ పూర్తి చేసుకన్న రైతులకే పథకం వర్తిస్తోంది. కేవలం ఈ కేవైసీ లేనందున దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ పథకం అందుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రాప్‌, ఈ-కేవైసీ పట్ల రైతులకు వ్యవసాయశాఖ అవగాహన కల్పిస్తోంది. రైతు భరోసా కేంద్రాల వారీగా ఈనెల 11 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 22 లోపు ప్రతి రైతు ఈ క్రాప్‌, ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీకేల్లోని వ్యవసాయశాఖ సహాయకులు ఈ క్రాప్‌, ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం రైతులకు సహకారం అందిస్తున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement