Tuesday, May 7, 2024

AP | తాగునీటికి రోడ్డెక్కిన మహిళలు.. కర్నూల్ గుంటూరు రోడ్డులో ట్రాఫిక్ జామ్

నందికొట్కూరు రూరల్, (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మా సమస్య తీర్చాలని మండల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేడుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామంలోని మహిళలంతా మంగళవారం కే జీ రోడ్డెక్కి నిరసన తెలిపారు.

గ్రామంలోని మహిళలు, ప్రజలు ధర్నా చేయడంతో గంటపాటు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. బ్రాహ్మణ కొట్కూరు ఎస్‌ఐ నాగార్జున తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement