Saturday, May 4, 2024

తిరుమ‌ల శ్రీవారికి రూ.కోటి విరాళం

తిరుమ‌ల శ్రీవారికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్‌సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్. ఆ డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందజేశారు ప్రసాద్, ఆంజేనయ ప్రసాద్. మరోవైపు అనంతపురంకు చెందిన శ్రీధర్ దంపతులు టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డీడీని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మా రెడ్డికి అందజేశారు. రుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి., ప్రముఖ నటుడు అశ్విన్ బాబు., టీటీడీ పాలకమండలి ఎక్స్ ఆఫీసియో సభ్యులు., ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement