Monday, April 29, 2024

Devotional – శ్రీనివాస కళ్యాణంతో తరించిన మింది గ్రామం

విశాఖపట్నం,ఆంధ్రప్రభ బ్యూరో, నవంబర్ 25: తిరుమల శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో మింది గ్రామం తరించింది. స్వామి వారు దేవేరులతో కలిసి ఏడుకొండలు దిగి మింది గ్రామానికి వచ్చి కళ్యాణం జరిపించుకుని భక్తజనులను అనుగ్రహించాడు. శ్రీశ్రీశ్రీ వినాయక వెంకటేశ్వర సాయినాథ ఆలయ కమిటీ చైర్మన్ గుడివాడ నాగమణి గురునాథరావు సంకల్పంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దంపతులు, కుటుంబ సభ్యుల చేతులు మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో అత్యంత వైభవంగా శ్రీవారి కల్యాణం మింది గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో పలు రకాల పుష్పాలతో అలంకరించిన వేదికపై శనివారం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. చిరునవ్వులు చిందిస్తూ, భక్తులను అనుగ్రహిస్తూ ఆసీనులైన శ్రీవారు దేవేరులకు జరిగిన ఈ కళ్యాణ వేడుకకు అనేకమంది పుర ప్రముఖులు మింది గ్రామస్తులు హాజరయ్యారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement