Thursday, May 2, 2024

Devineni Uma – మీ ప‌క్క ముఖ్య‌మంత్రి మీ ప‌రువు తీసేశారు…స్పంద‌న ఏది జ‌గ‌న్ ..

అమ‌రావ‌తి – సింగిల్ రోడ్డు అయితే ఎపి, డ‌బుల్ రోడ్డు అయితే తెలంగాణ‌… వెలుగు ఉంటే బంగారు తెలంగాణ‌, చీక‌టి ఉంటే అంధ అంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ తెలంగాణ సిఎం కెసిఆర్ చేసిన వాఖ్యాల‌తో ఎపి ప‌రువు మొత్తం పోయింద‌ని టిడిపి సీనియ‌ర్ నేత దేవినేని ఉమా వాపోయారు.. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు .. కేసీఆర్ మళ్లీ రాకపోతే మనది కూడా అమరావతి అవుతుందని తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఒక్క ఒక్క మంత్రి కూడా నోరుమెద‌ప‌డం లేదేంటి అంటూ ఉమా నిల‌దీశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement