Saturday, March 23, 2024

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లకు అంతరాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రిలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రాజమండ్రి స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణమధ్య రైల్వే తొమ్మిది రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పై హుటాహుటిన మరమ్మతులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement