Tuesday, May 21, 2024

Delhi Tour – నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్న చంద్ర‌బాబు నాయుడు

హైద‌రాబాద్ – టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. నవంబర్ 27న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు బాబు హాజరవుతారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు బాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి రిసెప్షన్‌కు హాజరుకానున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్‌లో జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. చంద్రబాబు కేసులకు సంబంధించి హైకోర్టుల్లో సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement