Monday, April 29, 2024

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళ‌లేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కారంపూడి గ్రామంలోని కాష్టాలు గడ్డకు చెందిన తెలగానేని మాధవ రావు (50) దాచేపల్లి రోడ్ లో ఉన్న తన సొంత వరి పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు పొలాలతో దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు కావ‌డంతో అప్పుల వాళ్ళకి ఏమి చెప్పాలో.. ఏమి చెయ్యాలో తెలియక చివరికి తన వరి పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతిని కుమారుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.బాలకృష్ణ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement