Saturday, May 18, 2024

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జాబ్ క్యాలెండర్: రామకృష్ణ

ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీలో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతోంది…కాని రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకే జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం యువతను మోసం చేయడమేనని ఆయన అన్నారు. గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని రామకృష్ణ విమర్శించారు. నెలకు రు.5 వేల వేతనంతో సేవలందిస్తున్న వాలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడమేంటని ఆయన ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో యువతకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement