Tuesday, April 30, 2024

ఏపీలో కొత్తగా 1,535 కరోనా కేసులు.. 16 మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,535 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, కొవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, ఉభయగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇది కూడా చదవండిః దళిత బంధుపై చల్లారని వేడి.. టీఆర్ఎస్‌లో టెన్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement