Wednesday, May 1, 2024

ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లో.. 14మంది విద్యార్థుల‌కు క‌రోనా

ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లో 14మంది విద్యార్థుల‌కు క‌రోనా సోకింది. దాంతో వారిని అధికారులు ఐసోలేష‌న్ లో ఉంచారు. ఈ సంఘ‌ట‌న విజయనగరం జిల్లా మక్కువ మండలంలో చోటు చేసుకుంది. ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా.. ఇండియా లో గత 24 గంటల్లో 11,692 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 66,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మ‌రోసారి క‌రోనా త‌న పంజా విసురుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement