Tuesday, May 21, 2024

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 40 మందికి కరోనా పాజిటివ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,081 శాంపిల్స్‌ను పరిశీలించగా 40 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా మరణాలు లేవని అధికారులు తెలిపారు. అనంతపురంలో 11, చిత్తూరులో రెండు , తూర్పు గోదావరిలో ఏడు, పశ్చిమ గోదావరిలో ఏడు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో మూడేసి చొప్పుక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైఎస్సార్‌ కడప, కృష్ణా, విజయనగరం జిల్లాలో ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.

కాగా, 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల 33 లక్షల 22 వేల 836 శాంపిల్స్‌ను పరిశీలించగా 23 లక్షల 19 వేల 181 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23 లక్షల 03 వేల 933 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 518 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement