Friday, May 3, 2024

Kavitha: కంగ్రాట్స్ ష‌ర్మిల‌…మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి

రాజా, అంజలికి కంగ్రాట్యులేషన్స్ అంటూ ష‌ర్మిల ఆనందాన్ని ఎమ్మెల్సీ క‌విత పంచుకున్నారు. వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి రెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. ఫొటోలను షేర్ చేశారు.

తన కొడుకు అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో ఎంఎస్ పూర్తి చేశాడని, కూతురు బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించిందని చెప్పారు. వారు సాధించిన దాని గురించి చెప్పడానికి ఆనందంగా ఉందని అన్నారు. మరోవైపు షర్మిల సంతోషాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పంచుకున్నారు. ‘రాజా, అంజలికి కంగ్రాట్యులేషన్స్. షర్మిల గారు.. మీ పిల్లలు సాధించిన ఉన్నతిని చూసిన మీ ఆనందం అపారమైనదని ఒక తల్లిగా నేను చెప్పగలను. మీ చిరునవ్వు మాదిరిగా వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement