Thursday, May 9, 2024

Condemned – ఆ పార్టీలో చేర‌డ‌మా….నెవ్వ‌ర్ః జెడి…

అమరావతి – సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ గత రెండు రోజులు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇందుకు కారణం.. ఓ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడమే. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ క్రమంలోనే వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలను అభినందించానని.. అంత మాత్రన తాను అధికార పార్టీలో చేరతానని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తాను వైసీపీలో చేరుతున్నానని, ఆ పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తాననే ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. గాలి వార్తలను నమ్మవద్దంటూ ఆయ‌న పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement