Thursday, April 18, 2024

రేపు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్య‌టించ‌నున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. 11.00 – 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement