Tuesday, April 30, 2024

ఎక్క‌డా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కూడదన్న సీఎం జ‌గ‌న్

జ‌వాద్ తుఫాన్ కార‌ణంగా రాష్ట్రంలో ఎక్క‌డా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లెక్ట‌ర్లు, అధికారుల‌కు సూచించారు. ఉత్తరాంధ్రలో జవాద్‌ తుపాన్‌ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించొద్దని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని… సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యమన్నారు.

అలాగే మంచినీరు, టాయిలెట్లు, ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలని, ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలని… ఆ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని… సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement