Tuesday, April 30, 2024

ఢిల్లీ బయల్దేరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కాగా ఇప్పటికే పలుసార్లు ప్రధానితో భేటీ అయిన జగన్ ఈసారి భేటీపై ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక విభజన హామీలు, అలాగే రాష్ట్రానికి సంబందించి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్యా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement