Friday, May 17, 2024

సంక్షేమ పథకాలు జగనన్నతోనే సాధ్యం : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి సిటీ : జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లే రాష్ట్రం లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయ‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక కోలా వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కార్యకర్తలుగా తామంతా ఇంటింటికీ వెళ్తుంటే ప్రజలు అనూహ్యంగా స్వాగతిస్తున్నారని కరుణాకర రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని, అందువల్ల మళ్లీ మళ్లీ వారినే ముఖ్యమంత్రి గా గెలిపించుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అత్యద్భుతంగా ఉందని, గతంలో ఎన్నడూ ఇంత గొప్పగా చేసిన ప్రభుత్వాలను చూడలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి వివరించారు. తిరుపతిలో రాజకీయాలకు ఆతీతంగా సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది శేఖర్ రాయల్, దినేష్ రాయల్, ఇమ్రాన్, పొన్నాల చంద్ర,దొరై రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement