Friday, May 3, 2024

పల్లె వెలుగు బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం..

వడమాలపేట: సత్యవేడు డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సు బోల్తాప‌డింది. వడమాలపేట సమీపం రెండో మలుపు బ్రిడ్జ్ కాలువలో ఉదయం 8.30 గం సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం త‌ప్పింది. ఎవరికి ఎలాంటి అవాంఛనీయం జరగలేదని తెలుస్తోంది. చిన్న చిన్న గాయలతో బయట పడ్డవారిని పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించ్చినట్లు స్థానికులు చెప్పారు. బస్సులో ఒక నిండు గర్భని ఉన్నట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement