Thursday, May 2, 2024

TTD NEWS : శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం ప్రారంభం

తిరుమల : తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం వైఖానస ఆగమక్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, దీక్ష హోమాలు, మొదటిరోజు విష్ణు హోమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగం చేశారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో 18వ తేదీ వరకు 21 మంది రుత్వికులు 7 హోమ గుండాలలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వ‌హించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement