Thursday, April 25, 2024

బ‌స్సు ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశించిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బాక‌రాపేట వ‌ద్ద శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డుప్ర‌మాదంలో బ‌స్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. వీరిలో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాకరాపేట ప్రమాదానికి గల కారణాలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కారణాలను అన్వేషిస్తుంది. ఈ విషయమై విచారణకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొంటే భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement