Wednesday, April 24, 2024

టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. టీటీడీ మొబైల్ యాప్ వచ్చేసింది.. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన ఈ యాప్‌ను రూపొందించారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేసుకోవచ్చు.. అలాగే తిరుమలకు సంబంధించి సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చు. గతంలో టీటీడీకి గోవింద యాప్‌ ఉండగా.. కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందుకే ఈ స్థానంలో కొత్త యాప్‌ తీసుకొచ్చారు.. జియోతో ఒప్పందం చేసుకున్నారు. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట ఉండేలా ఈ యాప్ రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement