Wednesday, March 27, 2024

ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

పెళ్లి బృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైన ఘ‌ట‌న పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పెళ్ళి బృందం ముటకూరు నుంచి శిరిగిరిపాడుకు స్కార్పియో వాహ‌నంలో వెళ్తుండగా వెల్దుర్తి వ‌ద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. మరో ఆరుగురుకి గాయాల‌య్యాయి. వెంట‌నే వీరికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రమాదంలో సమయంలో కారులో 9 మంది ఉన్నారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement