Friday, May 3, 2024

ప్రజా సంక్షేమం జగనన్న ఆశయం : నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి వారి సంక్షేమం కోసం పాటుపడడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్ లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నందున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల ఏడో తేదీన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలులో 98% నెరవేర్చడం జరిగిందని వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి పథకాల గురించి వివరించడంతోపాటు వారి మద్దతుతో సీఎం జగన్ స్టిక్కర్ ను అతికించడం జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటి వరకు 67 లక్షల మంది మద్దతుగా వచ్చాయ్ అన్నారు. అదేవిధంగా 50 లక్షల కాల్స్ రావడం జరిగిందన్నారు. ఆరు లక్షల మంది మా అమ్మకు నువ్వే జగన్ కోసం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తిరుపతికి 35వ ర్యాంకులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీలు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ కళ్యాణ్, నగర డిప్యూటీ మేయర్ భూమున్ అభినయ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement