Thursday, April 25, 2024

శ్రీవారి హుండీ ఆదాయం – 11 నెల‌ల్లో రూ.1400 కోట్లు.

తిరుమల,ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వందకోట్లకు పైబడి ఆదాయం లభి స్తుండడంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం 14 వందల కోట్ల మార్కును దాటింది. శ్రీనివాసుని దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. తమను కష్టాల నుంచి గట్టెంచిన స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించు కుని మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. శ్రీవా రికి భక్తులు సమర్పించే కానులతో టిటిడికి ప్రతినిత్యం 3 నుంచి 5 కోట్ల వరకు ఆదా యం లభిస్తోంది.

గతంలో కోవిడ్‌ కారణంగా రెండేళ్ళు శ్రీవారి దర్శనానికి టిటిడి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో స్వావివారికి హుండీ ఆదా యం కూడా తక్కువగానే లభించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన డంతో శ్రీవారి దర్శనానికి భక్తులను కోవిడ్‌కు పూర్వం ఉన్న విధానంలోనే భక్తులను టిటిడి అనుమతిస్తుండడంతో గతేడాదికి హుండీ ద్వారా శ్రీవారికి లభిస్తున్న ఆదాయం గణనీయంగా పెరుగుతూవుంది. గత 10 నెలలుగా భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వామివారికి గతేడాది కంటే ఎక్కువ హుండీ లభి స్తావుంది. గతంలో ఏడాదిరి 12 వందల కోట్ల వరకు హుండీ ఆదాయం లభించేది. సాధారణంగా మే, జూన్‌ మాసంలో మాత్రమే స్వామివారికి లభించే హుండీ ఆదా యం వందకోట్ల మార్కును దాటేది. మిగిలిన మాసాల్లో హుండీ ఆదాయం వంద కోట్లలోపే ఉండేది. కాని ప్రస్తుతం శ్రీవారికి ప్రతినిత్యం సరాసరి 4 కోట్ల రూపా యలకు పైగా హుండీ ఆదాయం లభిస్తావుంది. దీంతో గతేడాది మార్చి నెలలో 128.61 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తే ఏప్రిల్‌ నెలలో 127.63 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా మే నెలలో 129.93 కోట్ల ఆదాయం, జూన్‌ నెలలో 123. 76 కోట్ల ఆదాయం, జూలై నెలలో 139.46 కోట్ల ఆదాయం లభిస్తే ఆగస్టు నెలలో టిటిడి చరిత్రకే అత్యధికంగా రికార్డు స్థాయిలో 140.7 కోట్ల ఆదాయం లభించింది. సెప్టెంబర్‌లో 122.69, అక్టోబర్‌ నెలలో 122.23 కోట్ల రూపాయల ఆదాయం లభిం చింది. నవంబర్‌లో 127.30 కోట్లు, డిసెంబర్‌ నెలలో 129.46 కోట్ల ఆదాయం లభించింది. ఇక ఈఏడాది జనవరిలో 123.4 కోట్ల ఆదాయం లభించింది. దీంతో గత 11 నెలల కాలంలో స్వామివారికి దాదాపుగా 14 వంవదల కోట్ల రూపాయల ఆదాయం లభించడంతో ఈ సంవత్సరం శ్రీవారి హుండీ ఆదాయం 15 వంద‌ల‌ కోట్లు మార్కు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తానికి కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ళు శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం శ్రీవారికి లభిస్తున్న హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement