Friday, May 17, 2024

జ్యోతిరావుపూలేకు చంద్రబాబు నివాళులు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమసమాజ స్థాపనకు జ్యోతిరావుపూలే జీవితం అంకితం చేశారన్నారు. జ్యోతిబాపూలే ఆశయ స్ఫూర్తితో స్థాపించిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిదని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీలతో టీడీపీది విడదీయలేని అనుబంధమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement