Tuesday, April 30, 2024

AP : శ్రీ‌కాకుళం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

టీడీపీ ఛీఫ్ చంద్ర‌బాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు.

- Advertisement -

నేతలతో సమావేశం… అనంతరం పలాసలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఈరోజు రాత్రికి పలాసలోనే చంద్రబాబు బస చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు, పార్టీ అభ్యర్థులతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు సభకు పెద్దయెత్తున ఏర్పాట్నలు శ్రీకాకుళం జిల్లా నేతలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement