Friday, May 3, 2024

Chandrababu: ఉరవకొండలో ‘రా.. కదలిరా’ సభ.. పాల్గొననున్న బాబు

నేడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఉదయం చంద్రబాబు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా పీలేరుకు చేరుకోనున్నారు.

పీలేరులో మధ్యాహ్నం వరకూ చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొంటారు. ఆ వెంటనే రోడ్డు మార్గం ద్వారా పీలేరు మండలంలోని వేపులబైలు గ్రామానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ చంద్రబాబు సభ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకుంటారు. టీడీపీ నిర్వహించే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement