Wednesday, May 1, 2024

AP: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

విశాఖపట్నం : సింహాచలం అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఆలయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు.

చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు స్వామి వారి దగ్గరకు వచ్చారు. ఆలయ పురోహితులు చంద్రబాబు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement